• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 10: ప్రకటన గ్రంధం (ప్రకటనగ్రంధం పై నున్న వ్యాఖ్యానాలు)

[అధ్యాయము 6-1] దేవుని వలన ఏర్పాటు చేయబడిన ఏడు యుగాలు (ప్రకటన 6: 1-17)

(ప్రకటన 6: 1-17)
‘’గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.మరియు నేను చూడగా,ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను.అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు,జయించుటకు బయలువెళ్లెను. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపు కొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను¸ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.మరియు దేనార మునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవు వలనను ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని.వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వాని కియ్యబడెను;మరియు--వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను.సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను.మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతి ద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వాని యొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు’’.
 
 
వ్యాఖ్యానం
 
1 వవచనం: “యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.’’
ఈ వాక్యం యేసు, తండ్రి నుండి పొందిన గ్రంథపుచుట్ట యొక్క మొదటి ప్రణాళికను తెరుస్తుంది, ఇది మానవజాతి కోసం దేవుని మొత్తం ప్రణాళికను నమోదు చేస్తుంది.
 
2వ వచనం: ‘’అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.’’
దేవుని మొదటి ముద్ర యేసు క్రీస్తులో నీటి సువార్త మరియు ఆత్మ యొక్క స్థాపన గురించి మాట్లాడుతుంది, మానవాళిని పాపం నుండి విడిపించే దేవుని ప్రణాళిక, మరియు ఈ ప్రణాళిక యొక్క విజయం. వారి పాపాల నుండి వారిని రక్షించడం ద్వారా మానవాళిని తన ప్రజలలోకి తీసుకు రావాలనే తండ్రి ప్రణాళిక దేవుడు నీటి సువార్తతో మరియు యేసుక్రీస్తులోని ఆత్మతో ప్రారంభమైంది- అనగా, యేసు బాప్తీస్మం ద్వారా మరియు సిలువలో ఆయన రక్తం ద్వారా మానవాళిని పాపం నుండి విముక్తి వరకు తీసుక రాబడింది. 
దేవుడు ప్రపంచంలోని సమస్త పాపాల నుండి ఆత్మలను నీటి సువార్తతో మరియు ఆత్మతో విడిపించాడు, మరియు మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన దానిని కొనసాగిస్తున్నాడు. దేవుడు మానవజాతి కోసం నిర్దేశించిన మొదటి ప్రణాళిక ఇది. దేవుని ఈ మొదటి ప్రణాళికలో యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు రావడం, ఆయన బాప్తీస్మం, సిలువ వేయడం మరియు పునరుత్థానం ద్వారా మానవజాతి మోక్షానికి తీసుక రాబడింది.
తెల్లని గుర్రం యొక్క ఈ యుగం,నీతివంతమైన యుద్ధంలో దేవుని సువార్త విజయాన్ని సూచిస్తుంది, మానవాళిని సమస్త పాపాల నుండి విడిపించడానికి ఆయన ఇది నెరవేర్చాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త విజయవంతం అవుతుందని ఇది మనకు చెబుతుంది.
3-4 వ వచనాలు: “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియలో ఉన్న యేడుసంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు’’.
దేవుడు నిర్దేశించిన రెండవ యుగంలో, ప్రపంచం సాతాను ప్రపంచంగా మారుతుందని ఇది మనకు చెబుతుంది. ఇక్కడ ఎర్రని గుర్రం కనిపించడం అనగా ప్రపంచం సాతాను ఆధిపత్యంలోకి వస్తుంది.
సాతాను ఈ ప్రపంచానికి శాంతిని తీసివేసి యుద్ధాన్ని తీసుకొనివచ్చును. అతని కారణంగా, ప్రపంచం రెండువ ప్రపంచ యుద్దానికి దారి తీసింది, ఫలితంగా లెక్కలేనన్ని మంది ప్రాణాలు కోల్పోయారు, మరియు బయటపడిన వారు ప్రమాదకరమైన, నలిగినా శాంతితో జీవించెదరు.ఇప్పుడు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మరియు రాష్ట్రాలు ఒకరినొకరు అపనమ్మకం చేసుకుంటాయి మరియు ఒకరిపై మరొకరు యుద్ధం చేస్తాయి, అనేక చోట్ల శాంతిని దెబ్బతీయును. ఈ యుగం యుద్ధం మరియు మారణహోమం యొక్క యుగం.
5-6 వచనాలు: “నమ్మకమైనసాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.’’
దేవుడు మాట్లాడే మూడవ శకం నల్లని గుర్రం యొక్క యుగం, మానవాళికి శారీరక మరియు ఆధ్యాత్మిక కరువు యుగం. ఈ రోజు ప్రపంచం అంతటా, వారి ఆధ్యాత్మిక కరువు కారణంగా చాలా మంది ప్రజలు రక్షించబడలేదు మరియు శారీరక ఆకలితో చాలామంది చనిపోతున్నారు. మనం ఇప్పుడు ఈ మూడవ యుగంలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఈ యుగం గడిచేకొద్దీ, పాండుర వర్ణము గల గుర్రం యొక్క యుగం వస్తుంది.
7-8 వ వచనాలు: “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు;భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు;అవును ఆమేన్‌. అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.’’
దేవుడు నిర్దేశించిన నాల్గవ శకం పాండుర వర్ణము గల గుర్రం యొక్క యుగం. అంత్యక్రీస్తు తన కార్యకలాపాలను ఈ కాలంలోనే ప్రారంభిస్తాడని, ఈ యుగం కూడా పరిశుద్ధులకు హతసాక్షుల యుగం అని బైబిలు చెబుతుంది.అంత్యక్రీస్తు వారి నిజమైన విశ్వాసం యొక్క పరిశుద్ధులను దోచుకోవటానికి, తనను ఆరాధించని లేదా అతని గుర్తును అందుకోని వారిని హింసించి చంపడానికి ఇది సమయం. అప్పటి నుండి, ప్రపంచం ఏడు బూరల యొక్క తెగుళ్ల దుస్థితికి లోనవుతుంది. ఈ సమయంలో, పరిశుద్ధుల బలిదానం తప్పదు.
9-11 వచనాలు: “మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరమునీవు చూచు చున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.’’ 
దేవుని ఐదవ శకం పరిశుద్ధులు పునరుత్థానం మరియు ఎత్తబడు యుగం. ఈ యుగం తరువాత వెయ్యేండ్ల రాజ్యం ప్రారంభమవుతుంది.మనమందరం ఎదురుచూస్తున్న హతసాక్షుల యొక్క పునరుత్థానం మరియు ఎత్తబడుటను మనమందరం నమ్మాలి, మరియు దేవుడు మనకు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశం మరియు భూమిపై మన విశ్వాసం మరింత నిరీక్షణతోజీవించాలి .
12 వ వచనం: ‘’ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.’’
దేవుని యొక్క ఆరవ శకం దేవుడు సృష్టించిన మొదటి ప్రపంచాన్ని నాశనం చేసిన యుగం. ఈ సమయంలోనే ఏడు పాత్రల తెగుళ్ళు ప్రపంచంపైకి వస్తాయి, ఎప్పుడూ లేని విధంగా సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు తమ కాంతిని కోల్పోతాయి, మరియు భూకంపాల నుండి భూమి నీటిలో మునిగిపోతుంది.
13 వ వచనం: ”తిరుగగా ఏడుసువర్ణ దీపస్తంభములను, ఆదీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.’’
ఈ ఆరవ యుగంలో, దేవుడు సృష్టించిన విశ్వం యొక్క నాశనం ఏడు పాత్రల తెగుళ్ళ ద్వారా సంభవిస్తుంది. నక్షత్రాలు ఆకాశం నుండి పడి భూమిని కప్పివేయడముతో గొప్ప గందరగోళం ప్రపంచాన్ని చుట్టుముడుతుంది.
14 వ వచనం: “ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను’’.
ఈ వచనం ఏడు పాత్రల తెగుళ్ళు పోసినప్పుడు, ఆకాశం ఒక చుట్టబడిన గ్రంధం వలె పైకి లేచినట్లుగా అదృశ్యమవుతుందని, మరియు సమస్త పర్వతాలు మరియు ద్వీపాలు వాటి ప్రదేశాల నుండి తరలించబడతాయి-భూమిని ముక్కలుగా చేసే మార్పులను సూచించే విపత్తులు సంభవించును,అది ప్రపంచంలోని భౌతిక నిర్మాణాన్ని మారుస్తుంది.
 
15 వ వచనం: “ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయనకంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.’’
ఆరవ ముద్ర యొక్క ఈ యుగంలో, దేవుడు ఏడు పాత్రల తెగుళ్ళను కురిపించినప్పుడు, ఈ భూమిపై ఎవరూ నివసించ లేరు, రాజులు లేదా శక్తివంతులు, గొర్రెపిల్ల కోపంతో భయంతో వణికిపోరు.
16 వ వచనం: “ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను’’’.
దేవుని కోపం చాలా గొప్పది, మానవజాతి అంతా భయంతో వణికిపోతుంది. ఈ ఇలాంటి భయం మరియు విపత్తు మన చరిత్రలో ఇప్పుడు మరెప్పుడు జరిగి యుండలేదు. 
17 వ వచనం: “‘నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్దపడితిని.ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము’’.
ఏడు పాత్రల తెగుళ్ళు పోయబడినప్పుడు, ప్రతి ఒక్కరూ, ఎంత శక్తివంతంగా లేదా బలంగా ఉన్నా, పైన ఉన్న దేవుని కోపం నుండి వారిపైకి వచ్చే గొప్ప విపత్తుల భయంతో ప్రతి ఒక్కరూ వణుకుతారు. భయం లేకుండా దేవుని కోపం యెదుట నిలబడటానికి ఎవరూ సాహసం చేయ లేరు.
అయితే, ఏడవ శకం ఏమిటి? దేవుడు నిర్దేశించిన ఏడవ శకం, పరిశుద్ధులు వెయ్యేళ్ళ రాజ్యంలో నివసించే యుగం, తరువాత కొత్త ఆకాశము మరియు భూమి వారు శాశ్వతంగా జీవిస్తారు.